చైనాలో మరోసారి విజృంభిస్తున్న కరోనా కేసులు
- November 11, 2022
బీజింగ్: చైనాలో కోవిడ్ కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 వేల 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేనివారిలో కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా రాజధాని బీజింగ్ లో సిటీ పార్కులను మూసివేశారు. అలాగే పలు కోవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. అలాగే స్కూల్స్ కూడా మూతబడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. షాపులు, రెస్టారెంట్లు కూడా బంద్ అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు పరుస్తుంది.
గాంగ్ఝౌ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ కొద్దిరోజులుగా రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న హైఝులో ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడంతో ఆదివారం వరకు కఠిన లాక్డౌన్ విధించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంట్లో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







