ప్రధాని మోడీ గో బ్యాగ్ అంటూ ఓయూ స్టూడెంట్స్ నిరసన..
- November 12, 2022
హైదరాబాద్: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ఓయూ స్టూడెంట్స్ నిరసన చేపట్టారు. మోడీ గో బ్యాగ్ అంటూ పెద్ద ఎత్తున నల్ల జెండాలతో ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టొద్దు అంటూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో.. విద్యార్థి సంఘం నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులను బలవతంగా పోలీసులు వ్యాన్ ఎక్కంచి స్టేషన్కు తరలించారు.
అలాగే బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు గాల్లోకి ఎగురవేసి యూత్ ఫోర్స్ సభ్యులు నిరసన తెలిపారు. చేనేత మీద ఐదు శాతం జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రామగుండంలోను మోడీకి వ్యతిరేకంగా ప్లెక్సీ లు కట్టారు. తెలంగాణకు మోడీ ఇచ్చి హామీలు ఏమైంది..? ఐటీఐఆర్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్టైల్ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారని, పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని, ఐఐఎం ఏమైందని ప్రశ్నల రూపంలో నిలదీశారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







