షార్జాలో అభిమానులను అలరించిన షారూఖ్
- November 12, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన అయిన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో భారతీయ సినిమా స్టార్ షారుఖ్ ఖాన్ సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా షార్జా బుక్ అథారిటీ (SBA) చైర్మన్ అహ్మద్ అల్ అమేరి.. షారూఖ్ ఖాన్కు మొట్టమొదటి బుక్ ఫెయిర్ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ.. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు, SIBF డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని.. యాసిడ్ దాడి బాధితులకు, ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళలందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. జీవితంలో నిజాయితీగా ఉండాలని యువకులకు సూచించారు. యూఏఈలోని బహుళసాంస్కృతికత అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. షారూఖ్ నటించిన "పఠాన్" సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







