షార్జాలో అభిమానులను అలరించిన షారూఖ్
- November 12, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన అయిన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో భారతీయ సినిమా స్టార్ షారుఖ్ ఖాన్ సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా షార్జా బుక్ అథారిటీ (SBA) చైర్మన్ అహ్మద్ అల్ అమేరి.. షారూఖ్ ఖాన్కు మొట్టమొదటి బుక్ ఫెయిర్ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ.. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు, SIBF డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని.. యాసిడ్ దాడి బాధితులకు, ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళలందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. జీవితంలో నిజాయితీగా ఉండాలని యువకులకు సూచించారు. యూఏఈలోని బహుళసాంస్కృతికత అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. షారూఖ్ నటించిన "పఠాన్" సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి







