ట్రాలీపై విమానం.. ఏపీలో ఇరుక్కుపోయిన వైనం!
- November 13, 2022
బాపట్ల: హైదరాబాద్కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్లోని అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.దానిని తీసేందుకు సిబ్బంది నానా తంటాలు పడగా.. స్థానికులు మాత్రం ఇలాంటి దృశ్యం మరోసారి ఆవిష్కృతం కాదంటూ ఫొటోలను సెల్ ఫోన్లలో బంధించారు. కొందరు వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారు జామున ట్రాలీ లారీ పై వస్తున్న విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.
హైదరాబాద్లో ప్రముఖ హోటల్గా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. పాత విమానాన్ని హోటల్గా మార్చాలనే వినూత్న ఆలోచనలో దీనిని కొనుగోలు చేసింది. కొచ్చిన్లో పాత విమానాన్ని కొనుగోలు చేసి అక్కడే హోటల్గా మార్పులు చేసింది. అనంతరం రెక్కలను విడదీసి ట్రాలీ లారీలో విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్లోని అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.
ట్రాలీ లారీ బ్రిడ్జి కింద నిలిచిపోవటంతో ఆ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత పోలీసులు వేరే మార్గానికి వాహనదారులను దారి మళ్లించారు. అనంతరం విమానాన్ని జాగ్రత్తగా అండర్ పాస్ బ్రిడ్జి దాటించే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







