కువైట్ లో పెరగనున్న రెసిడెన్సీ, విజిట్ వీసా ఫీజులు!
- November 14, 2022
కువైట్: కొత్త రెసిడెన్సీ చట్టం, విజిట్ వీసాల జారీ తదితర అంశాలపై చర్చించడానికి ఈ నెలాఖరులో కువైట్ పార్లమెంటరీ అంతర్గత- రక్షణ కమిటీ సభ్యులతో అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబా మధ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లను జారీ చేసే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రెసిడెన్సీల పరిమితికి కొత్త చట్టం, వీసా ఫీజులు మూడు రెట్లు పెరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అలాగే రెసిడెన్సీ ఉల్లంఘించిన వారిపై కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రి షేక్ తలాల్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీకి పంపిన ముసాయిదా చట్టంలో కొత్త రెసిడెన్సీ చట్టంలో ఐదేళ్ల రెసిడెన్సీ అనుమతి ఉందన్నారు. అయితే, ఈ అనుమతి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు లేదా కువైట్ మహిళల పిల్లలకు కాదని షేక్ తలాల్ వివరించినట్లు కొందరు ఎంపీలు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







