బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2022: మూడు రోజులలో 50 వేల మంది సందర్శకులు
- November 14, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో (BIAS) 2022 ఆరవ ఎడిషన్ ను మూడు రోజుల వ్యవధిలో 50,000 మంది సందర్శకులు సందర్శించారని బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి మొహమ్మద్ బిన్ థామర్ అల్కాబి తెలిపారు. 30కి పైగా దేశాల నుండి 200 కంటే ఎక్కువ మిలిటరీ, సివిల్ డెలిగేషన్లు, 186 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయని వివరించారు. అలాగే ఆరు దేశాలు పెవిలియన్లను ఏర్పాటు చేశాయన్నారు. దాదాపు 100 మంది ఎగ్జిబిటర్లు ఉన్నాని, వాటిలో 73% అంతర్జాతీయ కంపెనీలని తెలిపారు. స్టాటిక్, ఫ్లయింగ్ డిస్ప్లేలలో దాదాపు 100 రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. రెడ్ ఆరోస్, సౌదీ హాక్స్, యూఏఈ అల్ ఫుర్సాన్, గ్లోబల్ స్టార్స్తో సహా ప్రముఖ బృందాలు మూడు రోజుల పాటు వైమానిక ప్రదర్శనలు నిర్వహించాయని అల్కాబి వెల్లడించారు. ఎయిర్షో (BIAS) 2022 సందర్భంగా పలు కంపెనీల మధ్య విలువైన ఒప్పందాలు కుదిరాయన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







