బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2022: మూడు రోజులలో 50 వేల మంది సందర్శకులు
- November 14, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో (BIAS) 2022 ఆరవ ఎడిషన్ ను మూడు రోజుల వ్యవధిలో 50,000 మంది సందర్శకులు సందర్శించారని బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి మొహమ్మద్ బిన్ థామర్ అల్కాబి తెలిపారు. 30కి పైగా దేశాల నుండి 200 కంటే ఎక్కువ మిలిటరీ, సివిల్ డెలిగేషన్లు, 186 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయని వివరించారు. అలాగే ఆరు దేశాలు పెవిలియన్లను ఏర్పాటు చేశాయన్నారు. దాదాపు 100 మంది ఎగ్జిబిటర్లు ఉన్నాని, వాటిలో 73% అంతర్జాతీయ కంపెనీలని తెలిపారు. స్టాటిక్, ఫ్లయింగ్ డిస్ప్లేలలో దాదాపు 100 రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. రెడ్ ఆరోస్, సౌదీ హాక్స్, యూఏఈ అల్ ఫుర్సాన్, గ్లోబల్ స్టార్స్తో సహా ప్రముఖ బృందాలు మూడు రోజుల పాటు వైమానిక ప్రదర్శనలు నిర్వహించాయని అల్కాబి వెల్లడించారు. ఎయిర్షో (BIAS) 2022 సందర్భంగా పలు కంపెనీల మధ్య విలువైన ఒప్పందాలు కుదిరాయన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







