దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- November 15, 2022
యూఏఈ: దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారుల కథనం ప్రకారం.. రాత్రి 7.28 గంటలకు మాల్ ముఖద్వారంలో చెలరేగిన మంటలను సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆపరేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆరు నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. రాత్రి 7.42 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అనంతర చేపట్టిన శీతలీకరణ కార్యకలాపాలు రాత్రి 8.09 గంటల వరకు కొనసాగాయి. ఆ తర్వాత మాల్ ని మూసివేయించి.. తదుపరి చేపట్టాల్సిన రక్షణ చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







