దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- November 15, 2022
యూఏఈ: దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారుల కథనం ప్రకారం.. రాత్రి 7.28 గంటలకు మాల్ ముఖద్వారంలో చెలరేగిన మంటలను సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆపరేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆరు నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. రాత్రి 7.42 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అనంతర చేపట్టిన శీతలీకరణ కార్యకలాపాలు రాత్రి 8.09 గంటల వరకు కొనసాగాయి. ఆ తర్వాత మాల్ ని మూసివేయించి.. తదుపరి చేపట్టాల్సిన రక్షణ చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









