పాపం.! త్రివిక్రమ్ టైమ్ బాగాలేదు.!
- November 16, 2022
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత త్రివిక్రమ్ నుంచి సినిమా రాలేదు.
ఎన్టీయార్తో సినిమా అనుకున్నాడు కానీ, అది కుదరలేదు. మహేష్తో ఇటీవలే సినిమాని పట్టాలెక్కించాడు. ఓపెనింగ్ బాగానే వుంది. ఫస్ట్ షెడ్యూల్ రాకెట్ స్పీడుతో కానిచ్చేశాడు. ఆ వేగం చూసి, షూటింగ్ మొత్తం అదే స్పీడులో పూర్తి చేసేస్తారనుకున్నారు అభిమానులు.
కానీ, అనుకోకుండా మహేష్ తల్లి ఇందిరమ్మ మరణం సెకండ్ షెడ్యూల్ షూటింగ్కి బ్రేక్ ఇచ్చేసింది. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కోలుకుంటున్న మహేష్ ఇక త్వరలోనే సెకండ్ షెడ్యూల్కి సిద్ధమవుతాడనుకుంటున్న టైమ్లో తండ్రి హఠాన్మరణం.. మహేష్ని ఇంకా కుంగదీసింది.
దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఈ బాధ నుంచి మహేష్ కోలుకోవడానికి ఇంకెంత టైమ్ పడుతుందో చెప్పలేని పరిస్థితి. పాపం త్రివిక్రమ్ టైమ్ బ్యాడ్. అనుకున్న టైమ్కి సినిమాని పూర్తి చేయగలడో లేదో ప్రస్తుతానికి సస్పెన్సే.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







