వినికిడి బాధితులకు అండగా ఉంటాం
- April 23, 2016
లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమాయిదన్, ఇసా టౌన్లో బహ్రెయిన్ మరియు కువైట్ రిహాబిలిటేషన్ వద్ద 41వ అరబ్ వీక్ ఫర్ డెఫ్ ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ అకీల్ అలి హస్సన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, వినికిడి సమస్యలతో బాధపడుతున్నవారి కోసం చేపడ్తున్న కార్యక్రమాల్ని ఈ సందర్భంగా వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహాకారలు అందిస్తుందని ఆయన చెప్పారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవాకి షిఖాన్ అల్ ఫార్సి సెంటర్ ఫర్ టోటల్ కమ్యూనికేషన్ అందిస్తున్న సహాయం గురించి ఈ సందర్భంగా వివరించారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ఉద్యోగులను ఈ ఈవెంట్లో మినిస్టర్ మరియు బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ తదితరులు ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







