ప్యారిస్ ఒప్పందంపై బహ్రెయిన్ సంతకం
- April 23, 2016
గ్లోబల్ వార్మింగ్ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని బహ్రెయిన్ అభిప్రాయపడింది. వాతావరణ మార్పులపై చారిత్రాత్మకమైన ప్యారిస్ ఒప్పందంపై బహ్రెయిన్ - వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సంతకం చేసింది. కింగ్ వ్యక్తిగత ప్రతినితి షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇందుకు వేదికయ్యింది. చైనా, అమెరికా కూడా ప్యారిస్ క్లైమేట్ డీల్పై సంతకం చేశాయి. 175 దేశాలకు చెందిన ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్, ఈ ఒప్పందంపై తొలి సంతకం చేశారు. 2020 డెడ్లైన్గా విధించినప్పటికీ, అంతకన్నా ముందే ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ మానవాళికి ముప్పుగా పరిణమించడంతో, ప్రతి దేశం తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అలాగే పర్యావరణంపై ఉమ్మడి పోరు అవసరమని ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







