TRAI: గుర్తు తెలియని మొబైల్ నెంబర్లతో జరిగే మోసాలకు చెక్.. త్వరలో కొత్త చట్టం తేనున్న భారత్
- November 16, 2022
న్యూ ఢిల్లీ : గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్, వేధింపులకు చెక్ పడబోతుంది. ఇకపై ఎవరు కాల్ చేసినా వారికి సంబంధించిన కచ్చితమైన పేరు తెలుస్తుంది. దీని కోసం భారత్ కొత్త చట్టం రూపొందిస్తుంది.
TRAI: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలో గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే కాల్స్, మోసాలకు చెక్ పడనుంది. దీని కోసం కేంద్రం కొత్త చట్టం తేనుంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ చాలా వరకు ఇబ్బంది పెట్టేవే ఉంటాయి. రకరకాల వేధింపులు, బెదిరింపులు ఉంటాయి.
కొన్నిసార్లు ఆర్థిక మోసాలకు కూడా కారణమవుతుంటాయి. వీటిపై ఫిర్యాదు చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. ఎందుకంటే ఆ నెంబర్లు నకిలీ ఐడీ ప్రూఫ్లతో తీసుకునేవి అయి ఉంటాయి. దీంతో ఆ నెంబర్లు ఎవరివో కనుక్కోవడం కష్టం. కానీ, ఇకపై ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) తేనున్న కొత్త చట్టం ద్వారా ఇలాంటి మోసాలకు చెక్ పడే అవకాశం ఉంది. పూర్తిగా కాకపోయినా, దీని ద్వారా మోసాలు, వేధింపులు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకీ కేంద్రం ఏం చేయబోతుందంటే.. మొబైల్ నెంబర్ ఉపయోగించాలంటే కేవైసీ విధానం తీసుకురానుంది. దీని ద్వారా ప్రతి నెంబర్కు సంబంధించిన కచ్చితమైన వివరాలు టెలికాం ఆపరేటర్ల దగ్గర నమోదవుతాయి.
ప్రతి నెంబర్ వాడుతున్న వారి పేరును సంస్థలు నమోదు చేస్తాయి. ఇది అమలైతే చాలా వరకు వినియోగదారులకు మేలు జరిగే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా అమలు చేస్తే.. కాల్ రిసీవ్ చేసుకున్న వారికి ఆ నెంబర్ ఎవరిదో సేవ్ చేసుకోకపోయినా వారు కేవైసీలో ఇచ్చిన పేరు కనిపిస్తుంది. కేవైసీ ద్వారా మోసానికి తక్కువ అవకాశం ఉంటుంది. అసలైన వినియోగదారుల నుంచే పేరు, వివరాలు సేకరిస్తారు. వాటిని సంస్థలు సేవ్ చేసుకుంటాయి. ఆ నెంబర్ నుంచి ఎవరికి కాల్ వెళ్లినా, ఆ పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం ట్రూ కాలర్ వంటి యాప్స్ వాడుతున్నా అవి కాల్ చేసే వారి కచ్చితమైన సమాచారం అందించలేవు. అయితే, కొత్త చట్టం ద్వారా అసలైన సమాచారం అందుతుంది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







