ఏపీలో కొత్తగా 10 మద్యం బ్రాండ్లు..
- November 16, 2022
కొత్తగా తీసుకురానున్న ఈ బ్రాండ్లలో తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు ఈ అనుమతులు ఇచ్చారు. వైయస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నుంచి రాష్ట్రంలోని అనేక కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు,
అమరావతి: ఇప్పటికే పలు కొత్త రకాల మద్యం బ్రాండ్లను తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొత్తగా మరో 10 బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురానుంది. అంతే కాకుండా, అదే కేటగిరీలోని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర 200 రూపాయలుగా ఉంది. ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల బీరు ధర 220 రూపాయలుగా నిర్ణయించారు.
కొత్తగా తీసుకురానున్న ఈ బ్రాండ్లలో తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు ఈ అనుమతులు ఇచ్చారు. వైయస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నుంచి రాష్ట్రంలోని అనేక కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే 300లకు పైగా బ్రాండ్లు ఏపీఎస్బీసీఎల్ వద్ద నమోదై ఉన్నాయి. వీటితో పాటు తాజాగా మరో 10 కొత్త బ్రాండ్లు ఈ జాబితాలో చేరాయి.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







