దుబాయ్‌లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూఏఈ గోల్డెన్ వీసా, ఆర్థిక బహుమతులు

- November 18, 2022 , by Maagulf
దుబాయ్‌లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూఏఈ గోల్డెన్ వీసా,  ఆర్థిక బహుమతులు

యూఏఈ: అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదివేందుకు ఆర్థిక బహుమతులు, స్కాలర్‌షిప్‌లను అందించాలని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్స్ టవర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మార్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి టాప్ 50 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులను కలుసుకున్నారు. వీరిలో 25 మంది ఎమిరాటీలు ఉండగా.. మరో 25 మంది ప్రవాసులు ఉన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎంపిక చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com