బహ్రెయిన్ లో 11 మంది డ్రగ్స్ పెడ్లర్ల అరెస్ట్
- November 19, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో గంజాయి మొక్కలను పెంచడం, మాదకద్రవ్యాలను విక్రయించడానికి నిల్వ చేసిన 11 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. అనుమానితుల్లో యూరప్, ఆసియా, ఇతర ఖండాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్లోని డ్రగ్ క్రైమ్ యూనిట్కు అందిన పక్కా సమాచారంపై విచారణ అనంతరం అరెస్టులు జరిగాయని అధికారులు వెల్లడించారు. విచారణలో నిందితులు తెలిపిన సమాచారంతో కొకైన్, హషీష్, గంజాయి మొక్కలను పెంచడానికి ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు నేరాలు చేసినట్లు అంగీకరించారని, తదుపరి విచారణ కోసం రిమాండ్కు తరలించినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ఈ కేసును క్రిమినల్ విచారణకు రిఫర్ చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సిద్ధమవుతోందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







