బహ్రెయిన్ లో 11 మంది డ్రగ్స్ పెడ్లర్ల అరెస్ట్
- November 19, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో గంజాయి మొక్కలను పెంచడం, మాదకద్రవ్యాలను విక్రయించడానికి నిల్వ చేసిన 11 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. అనుమానితుల్లో యూరప్, ఆసియా, ఇతర ఖండాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్లోని డ్రగ్ క్రైమ్ యూనిట్కు అందిన పక్కా సమాచారంపై విచారణ అనంతరం అరెస్టులు జరిగాయని అధికారులు వెల్లడించారు. విచారణలో నిందితులు తెలిపిన సమాచారంతో కొకైన్, హషీష్, గంజాయి మొక్కలను పెంచడానికి ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు నేరాలు చేసినట్లు అంగీకరించారని, తదుపరి విచారణ కోసం రిమాండ్కు తరలించినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ఈ కేసును క్రిమినల్ విచారణకు రిఫర్ చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సిద్ధమవుతోందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!







