టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

- November 20, 2022 , by Maagulf
టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

హైదరాబాద్: చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మరణం నుండి ఇంకా సినీ ప్రముఖులు , ప్రేక్షకులు బయటపడకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన అర్ధరాత్రి (ఆదివారం) 01.41 గంటల సమయంలో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ అయన ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు. ఈయన స్వస్థలం మదనపల్లి. రాజేంద్రప్రసాద్ నటించిన ఆ నలుగురు సినిమాకు మదన్‌ రచయితగా పనిచేశారు. ‘పెళ్లయిన కొత్తలో’ సినిమాతో దర్శకుడిగా మారిన మదన్.. ఆ తర్వాత గుండె ఝల్లు మంది, ప్రవరాఖ్యుడు..గరం, గాయత్రి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com