మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో జాక్పాట్ కొట్టిన ముగ్గురు ప్రవాసులు...
- November 20, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో ముగ్గురు ప్రవాసులు చెరో లక్ష దిర్హాములు గెలుచుకున్నారు. ఇందులో భారతీయ మహిళ మేరీ (43)తో పాటు ఇద్దరు ఫిలిప్పీన్స్ వాసులు జెన్నీఫర్ (44), ఎలుటెరియో (40) ఉన్నారు. తాజాగా దుబాయ్లో తీసిన డ్రాలో ఈ ముగ్గురు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మేరీ మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా తాను వరుసగా మహజూజ్ డ్రాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక తాను గెలిచిన నగదులో ఎక్కువ భాగం తన కూతురి చదువుల కోసం వినియోగిస్తానని చెప్పారు. అలాగే మరికొంత భాగాన్ని చారిటీకి ఇస్తానన్నారు. తన స్నేహితులకు పార్టీ ఇచ్చి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటానని మేరీ చెప్పుకొచ్చారు. మేరీతో పాటు ఈ డ్రాలో విజేతగా నిలిచిన మిగతా ఇద్దరు ఫిలిప్పీన్ ప్రవాసులు కూడా తాము గెలిచిన నగదులో కొంత భాగాన్ని స్వచ్చంధ సంస్థలకు విరాళంగా ఇస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష