ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం
- November 22, 2022
చైనా: చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హెనాన్ నగరంలో ఉన్న వర్క్షాప్లో అగ్నిప్రమాదం సంభవించడంతో 36 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదం సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో చోటు చేసుకుంది. 36 మంది మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ లభ్యంకాలేదని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 200 మందికి పైగా సెర్చ్ రెస్క్యూ వర్కర్లు, 60 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి కారకులుగా భావిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాదానికి కారణాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.
చైనాలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2019 మార్చినెలలో షాంఘైకి 260 కిమీ దూరంలోని యాంచెంగ్లోని ఒక రసాయన కర్మాగారం పేలింది. ఈ ఘటనలో 78 మంది మరణించారు. 2015లో ఉత్తర టియాంజిన్లోని ఒక రసాయన గోదాములో జరిగిన భారీ పేలుడులో 165 మంది మరణించారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







