ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం
- November 22, 2022
చైనా: చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హెనాన్ నగరంలో ఉన్న వర్క్షాప్లో అగ్నిప్రమాదం సంభవించడంతో 36 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదం సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో చోటు చేసుకుంది. 36 మంది మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ లభ్యంకాలేదని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 200 మందికి పైగా సెర్చ్ రెస్క్యూ వర్కర్లు, 60 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి కారకులుగా భావిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాదానికి కారణాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.
చైనాలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2019 మార్చినెలలో షాంఘైకి 260 కిమీ దూరంలోని యాంచెంగ్లోని ఒక రసాయన కర్మాగారం పేలింది. ఈ ఘటనలో 78 మంది మరణించారు. 2015లో ఉత్తర టియాంజిన్లోని ఒక రసాయన గోదాములో జరిగిన భారీ పేలుడులో 165 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









