విద్యార్థులకు శుభవార్త చెప్పిన టీఎస్ ఆర్టీసీ
- November 24, 2022
హైదరాబాద్: టిఆర్ఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ అందజేస్తూ వస్తుంది. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి సజ్జనార్ సరికొత్త ఆలోచనలతో ప్రయాణికుల్లో ఆనందం నింపుతున్నారు. ప్రవైట్ ట్రావెల్స్ కు ఏమాత్రం తగ్గకుండా పండగల వేళా ఆఫర్లు ప్రకటిస్తూ..నిత్యం ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు బస్సులను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అలాగే ఆర్టీసీకి ఆదాయం సమకూర్చడంలోను విజయం సాధిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో తీపి కబుర్లు తెలిపిన ఈయన..తాజాగా విద్యార్థులకు గుడ్న్యూస్ అందజేశారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల గ్రేటర్ హైదరాబాద్ బస్పాస్లను పరిమితి వరకు అనుమతించాలని ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయించారు.
ప్రస్తుతం సిటీ బస్సుల్లోనే వారి పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో విద్యార్థుల సాధారణ బస్సు పాసులను అనుమతించటం లేదు. నగర శివారులో సిటీ బస్సులు తక్కువగా తిరిగుతున్నందున వీరు ప్రైవేటు వెహికల్స్ను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆర్టీసీ సిటీ బస్పాస్ ఉన్న విద్యార్థులను పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులోనూ ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకటన తో స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







