కువైట్ సిటీబస్ 10 మంది 'గోల్డ్ బార్' విజేతలు వీరే
- November 24, 2022
కువైట్: కువైట్లోని ప్రముఖ ప్రజా రవాణా ఆపరేటర్ అయిన సిటీబస్.. తన ఫస్ట్ మంత్లీ 'గోల్డ్ రష్' రాఫెల్ ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన 10 మంది విజేతలను ప్రకటించింది. విజేతలకు 5 గ్రాముల చొప్పున 24 క్యారెట్ల బంగారు కడ్డీలను బహుమతుల కింద అందజేసింది.
బంగారం గెలిచిన 10 మంది విజేతలు
అభిషేక్ కుమార్, సీన్ మాగ్జిమస్ బౌటిస్టా, తవడ్రస్ హలీమ్ ఫరా, డెన్హామ్ ఆంథోనీ లాబ్రూయ్, సాలీ ఫెర్నాండో కయనన్, క్రిసెల్ తుంబగా, జగదీష్ పాటిదార్, బెన్సీ చక్కలాయిల్ వర్గీ బేబీ, దీపక్ పాండే, ఎడ్గార్ బలియత్లు. ఈ 10 మంది విజేతలను సిటీబస్ అభినందించింది. తమ కంపెనీకి మద్దతుగా నిలిచిన కస్టమర్లకు ప్రోత్సాహకంగా సిటీబస్ అక్టోబర్ 14న ‘గోల్డ్ రష్’ రాఫిల్ మంత్లీ డ్రాను ప్రారంభించింది.
ఈ ప్రమోషన్ రాబోయే రెండు నెలల్లో సిటీబస్లో ప్రయాణించే ప్రయాణికులందరికీ వర్తిస్తుంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు తమ టిక్కెట్లను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి టికెట్ గోల్డ్ బార్ను గెలుచుకునే అవకాశం ఉంది. ఒకే ప్రయాణికుడు ఎన్నైనా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా 10 మంది విజేతలు 5 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ బార్ను అందజేస్తారు. రాఫిల్ డ్రా ముగింపులో ఒక మెగా రాఫిల్ విజేతకు 40 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ బార్ను అందిస్తారు. ఈ ప్రమోషన్ జనవరి 15 వరకు కొనసాగుతుందని సిటీబస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ ధీరజ్ భరద్వాజ్ తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







