కువైట్ సిటీబస్ 10 మంది 'గోల్డ్ బార్' విజేతలు వీరే
- November 24, 2022కువైట్: కువైట్లోని ప్రముఖ ప్రజా రవాణా ఆపరేటర్ అయిన సిటీబస్.. తన ఫస్ట్ మంత్లీ 'గోల్డ్ రష్' రాఫెల్ ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన 10 మంది విజేతలను ప్రకటించింది. విజేతలకు 5 గ్రాముల చొప్పున 24 క్యారెట్ల బంగారు కడ్డీలను బహుమతుల కింద అందజేసింది.
బంగారం గెలిచిన 10 మంది విజేతలు
అభిషేక్ కుమార్, సీన్ మాగ్జిమస్ బౌటిస్టా, తవడ్రస్ హలీమ్ ఫరా, డెన్హామ్ ఆంథోనీ లాబ్రూయ్, సాలీ ఫెర్నాండో కయనన్, క్రిసెల్ తుంబగా, జగదీష్ పాటిదార్, బెన్సీ చక్కలాయిల్ వర్గీ బేబీ, దీపక్ పాండే, ఎడ్గార్ బలియత్లు. ఈ 10 మంది విజేతలను సిటీబస్ అభినందించింది. తమ కంపెనీకి మద్దతుగా నిలిచిన కస్టమర్లకు ప్రోత్సాహకంగా సిటీబస్ అక్టోబర్ 14న ‘గోల్డ్ రష్’ రాఫిల్ మంత్లీ డ్రాను ప్రారంభించింది.
ఈ ప్రమోషన్ రాబోయే రెండు నెలల్లో సిటీబస్లో ప్రయాణించే ప్రయాణికులందరికీ వర్తిస్తుంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు తమ టిక్కెట్లను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి టికెట్ గోల్డ్ బార్ను గెలుచుకునే అవకాశం ఉంది. ఒకే ప్రయాణికుడు ఎన్నైనా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా 10 మంది విజేతలు 5 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ బార్ను అందజేస్తారు. రాఫిల్ డ్రా ముగింపులో ఒక మెగా రాఫిల్ విజేతకు 40 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ బార్ను అందిస్తారు. ఈ ప్రమోషన్ జనవరి 15 వరకు కొనసాగుతుందని సిటీబస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ ధీరజ్ భరద్వాజ్ తెలిపారు.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్