సమంతకు మళ్లీ అనారోగ్యం.! నెట్టింట వైరల్ అవుతున్న ఇష్యూ.!
- November 24, 2022
ఇటీవల ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో ఆసుపత్రిలో చేరిన సమంత, ప్రస్తుతం ఆరోగ్యంగానే వుంది. చికిత్స అనంతరం ఇంట్లోనే వుండి రెస్ట్ తీసుకుంటోంది సమంత.
మరికొద్ది రోజుల్లోనే తాను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వర్కవుట్లు కూడా స్టార్ట్ చేసింది సమంత.
ఇదిలా వుంటే, మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమంత అంటూ సోషల్ మీడియాలో ఓ గాలి వార్త సడెన్గా పుట్టుకొచ్చింది. ఇది గాలి వార్తే అంటూ సమంత మేనేజర్ ఖండించాడు. సమంత ఆరోగ్యంగానే వుంది. ఇంట్లోనే వుంది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తనకు ‘మయోసైటిస్’ అను వ్యాధి వుందని సమంత చెబితేనే తెలిసింది. వన్స్ ఈ విషయం బయటికొచ్చాకా ఇదే తరహా వ్యాధి.? వస్తే ఏమవుతుంది.? అంటూ ఆరాలు పట్టిన నెటిజన్లు.. ఇంకేముంది.. ఈ వ్యాధి వస్తే చచ్చిపోవడమే.. అంటే సమంత నయం కాని వ్యాధితో బాధపడుతోంది.. కెరీర్కి ఇకపై గుడ్ బై చెప్పేయాల్సిందే.. అన్నట్లుగా పుకార్లు పుట్టించేశారు.
నేనింకా చావలేదు. నేను బాగానే వున్నాను.. అంటూ సమంత స్వయంగా బయటికి వచ్చి చెబితే కానీ, ఆ పుకార్లకు చెక్ పడలేదు. ఇప్పుడు మళ్లీ ఇదిగో ఇలాంటి పుకార్లు..! ఏం చేస్తాం.! నెటిజన్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







