వర్క్ పర్మిట్ల సస్పెన్షన్: యూఏఈలో కొత్త నిబంధనలు
- November 26, 2022
యూఏఈ: కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్లను నిలిపివేయడానికి దారితీసే నాలుగు రకాల ఉల్లంఘనల గురించి యూఏఈ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) వెల్లడించింది. కొత్తగా ప్రకటించిన తీర్మానంలో ఈ నాలుగు ఉల్లంఘనల గురించి నిర్వచించబడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఆ నాలుగు రకాల ఉల్లంఘనలు:
1. మంత్రిత్వ శాఖ సవరణల ద్వారా సేవా రుసుములు, అడ్మినిస్ట్రేటివ్ జరిమానాలకు సంబంధించి 2020 క్యాబినెట్ రిజల్యూషన్ నం. 21లో నిర్దేశించిన ఉల్లంఘనలు.
2. తగిన కార్మిక వసతి కల్పించడంలో వైఫల్యం. ఉద్యోగులకు అవసరమైన వసతి కల్పించే వరకు కంపెనీ ఫైల్ అడ్మినిస్ట్రేటివ్గా నిలిపివేయబడుతుంది.
3. మానవ అక్రమ రవాణా ఆరోపణలు., ఉల్లంఘించిన సంస్థ నిర్దోషి అని నిరూపించబడే వరకు సస్పెండ్ చేయబడుతుంది. దోషిగా తేలితే కంపెనీకి వ్యతిరేకంగా తుది తీర్పు వెలువడిన తర్వాత సస్పెన్షన్ రెండేళ్లపాటు కొనసాగుతుంది.
4. మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి కంపెనీకి మంజూరు చేయబడిన ఎలక్ట్రానిక్ అధికారాల దుర్వినియోగం. ఈ సందర్భంలో కంపెనీ ఫైల్ నిరూపితమైన ఉల్లంఘన తేదీ నుండి ఆరు నెలల కాలానికి పరిపాలనాపరంగా నిలిపివేయబడుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









