లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- March 25, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లేపాక్షి) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లియరెన్స్ సేల్కు హస్తకళల ప్రేమికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వినియోగదారులు ఆసక్తిగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్టంగా 50 శాతం వరకు రాయితీ అందుబాటులో ఉండటంతో అన్ని షోరూమ్లలో సందడి నెలకొంది.
మార్చి 1న ప్రారంభమైన ఈ వార్షిక సేల్ మార్చి 31 వరకు అన్ని లేపాక్షి షోరూమ్లలో కొనసాగుతోంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ రాయితీ అమ్మకాలను వినియోగించుకునేందుకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సేల్లో కొండపల్లి బొమ్మలు, ఎటికొప్పాక కళాఖండాలు, చెక్క శిల్పాలు, కలంకారి చీరలు, బొబ్బిలి వీణ, కంచు విగ్రహాలు, రాయి శిల్పాలు, తోలుబొమ్మలాట కళాఖండాలు, పెన్ కలంకారి, సవారా ఆదివాసి చిత్రాలు, బుడిది పిత్తళి వస్తువులు వంటి విభిన్న హస్తకళా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, అనంతపురం, హైదరాబాద్ తదితర నగరాల్లోని లేపాక్షి షోరూమ్లలో కొనుగోలు దారుల రద్దీ కనిపిస్తోంది. హస్తకళాకారులకు మద్దతు ఇవ్వడం, సాంప్రదాయ కళలను పరిరక్షించడం, సంప్రదాయ నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఎండీ విశ్వ మనోహరన్ తెలిపారు.సేల్ ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మరింత మంది వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







