యూరప్ వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి.!
- November 26, 2022
‘బాస్ పార్టీ’ అంటూ లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ‘వాల్తేర్ వీరయ్య’లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలాతో మెగాస్టార్ వేసిన ఈ స్పెషల్ స్టెప్పులు మెగా ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేశాయి.
చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’ సినిమా నుంచి స్టెప్పులు కాపీ కొట్టేశారనీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్లు కూడా కాపీ కొట్టేశాడంటూ ఈ పాటపై అనేక విమర్శలొచ్చాయ్ కానీ, సాంగ్ అయితే ఓ ఊపు ఊపేసింది.
ఇక, ఇప్పుడు మరో సాంగ్ షూటింగ్ కోసం ‘వాల్తేర్ వీరయ్య’ అండ్ టీమ్ యూరప్ బయల్దేబోతోందట. హీరోయిన్ శృతిహాసన్తో ఓ రొమాంటిక్ సాంగ్తో పాటూ వీలైతే మరికొన్ని పాటలు యూరప్ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందబోతన్న ‘వాల్తేర్ వీరయ్య’పై భారీగా అంచనాలున్నాయ్.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







