యూరప్ వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి.!
- November 26, 2022‘బాస్ పార్టీ’ అంటూ లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ‘వాల్తేర్ వీరయ్య’లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలాతో మెగాస్టార్ వేసిన ఈ స్పెషల్ స్టెప్పులు మెగా ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేశాయి.
చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’ సినిమా నుంచి స్టెప్పులు కాపీ కొట్టేశారనీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్లు కూడా కాపీ కొట్టేశాడంటూ ఈ పాటపై అనేక విమర్శలొచ్చాయ్ కానీ, సాంగ్ అయితే ఓ ఊపు ఊపేసింది.
ఇక, ఇప్పుడు మరో సాంగ్ షూటింగ్ కోసం ‘వాల్తేర్ వీరయ్య’ అండ్ టీమ్ యూరప్ బయల్దేబోతోందట. హీరోయిన్ శృతిహాసన్తో ఓ రొమాంటిక్ సాంగ్తో పాటూ వీలైతే మరికొన్ని పాటలు యూరప్ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందబోతన్న ‘వాల్తేర్ వీరయ్య’పై భారీగా అంచనాలున్నాయ్.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?