యూరప్ వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి.!
- November 26, 2022
‘బాస్ పార్టీ’ అంటూ లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ‘వాల్తేర్ వీరయ్య’లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలాతో మెగాస్టార్ వేసిన ఈ స్పెషల్ స్టెప్పులు మెగా ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేశాయి.
చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’ సినిమా నుంచి స్టెప్పులు కాపీ కొట్టేశారనీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్లు కూడా కాపీ కొట్టేశాడంటూ ఈ పాటపై అనేక విమర్శలొచ్చాయ్ కానీ, సాంగ్ అయితే ఓ ఊపు ఊపేసింది.
ఇక, ఇప్పుడు మరో సాంగ్ షూటింగ్ కోసం ‘వాల్తేర్ వీరయ్య’ అండ్ టీమ్ యూరప్ బయల్దేబోతోందట. హీరోయిన్ శృతిహాసన్తో ఓ రొమాంటిక్ సాంగ్తో పాటూ వీలైతే మరికొన్ని పాటలు యూరప్ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందబోతన్న ‘వాల్తేర్ వీరయ్య’పై భారీగా అంచనాలున్నాయ్.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







