కువైట్ లో కలరా కేసు నమోదు
- November 27, 2022కువైట్: కలరా వ్యాప్తితో బాధపడుతున్న పొరుగు దేశం నుండి ఇటీవల తిరిగి వచ్చిన ఒక జాతీయుడిలో కలరా సంక్రమణ లక్షణాలను గుర్తించినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కలరా సోకిన పౌరుడు క్వారంటైన్ లో ఉన్నారని, అతను కోలుకునే వరకు మంత్రిత్వ శాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కలరా సంబంధిత ప్రోటోకాల్ల ప్రకారం.. కేసును డీల్ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో కలరా వ్యాప్తి చెందే అవకాశాన్ని మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అయితే కలరా వ్యాప్తిని నివేదించిన దేశాలను సందర్శించేటప్పుడు జాతీయులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని.. అసురక్షిత నీరు, ఆహార పదర్థాలకు దూరంగా ఉండాలని సూచించింది. వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలలో పర్యటించి వచ్చిన ఏడు రోజులలోపు జ్వరం, డయేరియా, కలరా వంటి అనుమానిత లక్షణాలను గుర్తిస్తే.. అవసరమైన సలహాలు, చికిత్సను పొందేందుకు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం