ఎలాన్ మస్క్కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన యూపీ పోలీసులు.. ఫిదా అంటున్న నెటిజెన్లు
- November 27, 2022యూపీ: ట్విట్టర్ను సొంతం చేసుకున్న అనంతరం నాటి నుంచి తన ట్వీట్లతో మరింత ఆసక్తి రేపుతున్నారు ఎలాన్ మస్క్. ఏదో ఒక సంచలన ప్రకటనలతో, కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరుచూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. అందరికీ సెటైర్లు వేస్తూ హడావుడి చేస్తున్న మస్క్కు తాజాగా యూపీ పోలీసులు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్కు బదులుగా ట్విట్టర్ వేదికగానే యూపీ పోలీసులు ఇచ్చిన ఈ కౌంటర్కు నెటిజెన్లు ఫిదా అంటున్నారు. అదిరిపోయిందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
నవంబర్ 22న మస్క్ ఒక ట్వీట్ చేశారు. ‘‘కాస్త ఆగండి, నేనేదైనా ట్వీట్ చేస్తే నిజంగా అది పరిగణలోకి వస్తుందా?’’ అని నెటిజెన్లను ప్రశ్నించారు. మస్క్ ఎంతో కొంటెగా చేసిన ఈ ట్వీట్పై యూపీ పోలీసులు అంత కంటే కొంటెగా స్పందించారు. ‘‘కాస్త ఆగండి, యూపీ పోలీసులు ట్విట్టర్ ద్వారా మీ సమస్యలు పరిష్కరిస్తే అవి పరిగణలోకి వస్తాయా?’’ అని మస్క్ ట్వీట్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వాస్తవానికి తన ట్వీట్లలో 90 శాతం ట్వీట్లు సాంకేతికత ఆధారంగా జనరేట్ అవుతాయని మస్క్ ఓ సందర్భంలో చెప్పారు. పైగా ఆయనపై ఇలాంటి ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మస్క్ నుంచి ట్వీట్ రావడం, ఆ ట్వీట్ను ఉద్దేశిస్తున్నట్లుగానే యూపీ పోలీసులు ట్వీట్ చేయడం వైరల్ అవుతోంది.
అనంతరం ఈ రెండు ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి ‘అవును, పరిగణించబడుతుంది’ అని యూపీ పోలీసులే మరో ట్వీట్ చేయడం గమనార్హం. యూపీ పోలీసులు స్పందించిన తీరుపై నెటిజెన్లు ఫిదా అంటున్నారు. ‘చాలా అద్భుతమైన రిప్లై’ అని ఒకరు, ‘యూపీ పోలీసులు ఇప్పుడు తమ రాష్ట్ర పరిధి దాటి సమస్యలు పరిష్కరిస్తున్నారు’ అంటూ మరొకరు ‘యూపీ పోలీసుల సేవకు పరిధులు లేవు’ అంటూ.. ఇలా నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు