దుబాయ్ ఎడారి రిజర్వ్ లో కొత్తగా 100 కి.మీ ట్రెక్కింగ్ మార్గం
- November 27, 2022
దుబాయ్: వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ దుబాయ్ లో నిర్మించిన కొత్త ఎడారి రిజర్వ్ను సందర్శించారు. కొత్తగా నిర్మించిన 100 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్ మార్గాన్ని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆవిష్కరించారు. "ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం దుబాయ్. ఇక్కడి గ్రామీణ ప్రాంతాలను, అరణ్యాలను అత్యంత ఆనందదాయకంగా, అందంగా మార్చడం మా తదుపరి లక్ష్యం" అని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించిన ఎడారి రిజర్వ్ లుసైలీ, లెహబాబ్, అల్ మర్రామ్, అల్ ఫకా, అల్ అవీర్, ఇతర ప్రాంతాలలో విస్తరించింది. ఇందులో మానవ నిర్మిత సరస్సు సైహ్ అల్ సలామ్ ప్రత్యేక ఆకర్షణ. దుబాయ్ లో ఇప్పటికే 90కిమీల ఎడారి సైక్లింగ్ ట్రాక్ ఉన్నది. ఇది కూడా పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నదని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







