దుబాయ్ ఎడారి రిజర్వ్ లో కొత్తగా 100 కి.మీ ట్రెక్కింగ్ మార్గం
- November 27, 2022
దుబాయ్: వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ దుబాయ్ లో నిర్మించిన కొత్త ఎడారి రిజర్వ్ను సందర్శించారు. కొత్తగా నిర్మించిన 100 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్ మార్గాన్ని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆవిష్కరించారు. "ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం దుబాయ్. ఇక్కడి గ్రామీణ ప్రాంతాలను, అరణ్యాలను అత్యంత ఆనందదాయకంగా, అందంగా మార్చడం మా తదుపరి లక్ష్యం" అని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించిన ఎడారి రిజర్వ్ లుసైలీ, లెహబాబ్, అల్ మర్రామ్, అల్ ఫకా, అల్ అవీర్, ఇతర ప్రాంతాలలో విస్తరించింది. ఇందులో మానవ నిర్మిత సరస్సు సైహ్ అల్ సలామ్ ప్రత్యేక ఆకర్షణ. దుబాయ్ లో ఇప్పటికే 90కిమీల ఎడారి సైక్లింగ్ ట్రాక్ ఉన్నది. ఇది కూడా పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నదని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- ఇంద్రకీలాద్రి వసంతోత్సవాలకు పోటెత్తిన భక్తులు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!









