భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పిటి ఉష
- November 28, 2022
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ పిటి ఉష ఎన్నిక లాంఛనంగా నిలిచింది.డిసెంబర్ 10న జరిగే ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ఉష ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.14 మంది టీమ్ సభ్యులు కూడా పలు పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధ్యక్ష పదవికి ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో 58ఏళ్ల పరుగు ల రాణి అధ్యక్షురాలిగా దాదాపు ఖరారయ్యారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి వారంతో గడువు ముగియగా పదవులకు 24మంది దాఖలు చేశారు. వీరిలో 12మంది కార్యనిర్వాహక మండలి సభ్యులస్థానాలకు పోటీపడుతున్నారు. కాగా ఉష ఆసియా గేమ్స్ల్లో బంగారు పతకాలు సాధించారు. 1984 లో జరిగిన 400మీటర్ల ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా ఉష రికార్డు సృష్టించనున్నారు.
తాజా వార్తలు
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!









