భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పిటి ఉష
- November 28, 2022
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ పిటి ఉష ఎన్నిక లాంఛనంగా నిలిచింది.డిసెంబర్ 10న జరిగే ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ఉష ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.14 మంది టీమ్ సభ్యులు కూడా పలు పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధ్యక్ష పదవికి ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో 58ఏళ్ల పరుగు ల రాణి అధ్యక్షురాలిగా దాదాపు ఖరారయ్యారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి వారంతో గడువు ముగియగా పదవులకు 24మంది దాఖలు చేశారు. వీరిలో 12మంది కార్యనిర్వాహక మండలి సభ్యులస్థానాలకు పోటీపడుతున్నారు. కాగా ఉష ఆసియా గేమ్స్ల్లో బంగారు పతకాలు సాధించారు. 1984 లో జరిగిన 400మీటర్ల ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా ఉష రికార్డు సృష్టించనున్నారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







