తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు
- November 28, 2022
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా 6వ అంతస్తులోని సిఎం బ్లాకు ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్లో కెసిఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి ఆదివారం పరిశీలించారు. మూడు షిఫ్టుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను, వర్క్ ఏజెన్సీలకు సిఎం విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగాలని వర్కర్లను పెంచి మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు జరిగేలా చూడాలని వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







