తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు
- November 28, 2022
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా 6వ అంతస్తులోని సిఎం బ్లాకు ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్లో కెసిఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి ఆదివారం పరిశీలించారు. మూడు షిఫ్టుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను, వర్క్ ఏజెన్సీలకు సిఎం విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగాలని వర్కర్లను పెంచి మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు జరిగేలా చూడాలని వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









