యూఏఈ జాతీయ దినోత్సవం: 1,040 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2022
యూఏఈ: యూఏఈ 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఎమిరేట్లోని 1,040 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, వారి కుటుంబాలకు సంతోషాన్ని కలిగించడానికి షేక్ మహమ్మద్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారని తెలిపారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ను అమలు చేయడానికి దుబాయ్ పోలీసులతో సమన్వయం చేయడం ప్రారంభించిందని అల్ హుమైదాన్ చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక సందర్భాలలో దేశ పాలకులు చాలా మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారని.. దాంతో వారు సత్ర్పవర్తన కలిగి సమాజంలో మెరుగైన జీవనాన్ని పొందుతారన్నారు.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









