యూఏఈ జాతీయ దినోత్సవం: 1,040 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2022
యూఏఈ: యూఏఈ 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఎమిరేట్లోని 1,040 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, వారి కుటుంబాలకు సంతోషాన్ని కలిగించడానికి షేక్ మహమ్మద్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారని తెలిపారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ను అమలు చేయడానికి దుబాయ్ పోలీసులతో సమన్వయం చేయడం ప్రారంభించిందని అల్ హుమైదాన్ చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక సందర్భాలలో దేశ పాలకులు చాలా మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారని.. దాంతో వారు సత్ర్పవర్తన కలిగి సమాజంలో మెరుగైన జీవనాన్ని పొందుతారన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







