యూఏఈ జాతీయ దినోత్సవం: 1,040 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 30, 2022
యూఏఈ: యూఏఈ 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఎమిరేట్లోని 1,040 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, వారి కుటుంబాలకు సంతోషాన్ని కలిగించడానికి షేక్ మహమ్మద్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారని తెలిపారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ను అమలు చేయడానికి దుబాయ్ పోలీసులతో సమన్వయం చేయడం ప్రారంభించిందని అల్ హుమైదాన్ చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక సందర్భాలలో దేశ పాలకులు చాలా మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారని.. దాంతో వారు సత్ర్పవర్తన కలిగి సమాజంలో మెరుగైన జీవనాన్ని పొందుతారన్నారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







