హైదరాబాద్లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు
- November 30, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ నుంచి హైదరాబాద్ కు మత్తు మందు దిగుమతి చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్ వోటీ, నేరేడ్ మెట్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి 750 గ్రాముల ఓపీఎం, 500 గ్రాముల పాపిస్టా స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటి విలువ రూ.12.5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. వారు ప్రయణిస్తున్న కారును కూడా సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. నగరంలోని వ్యాపారస్తులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో నలుగురిని ఎల్ బీ నగర్ ఎస్ వోటీ, సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 గ్రాముల హెరాయిన్, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









