హైదరాబాద్లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు
- November 30, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ నుంచి హైదరాబాద్ కు మత్తు మందు దిగుమతి చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్ వోటీ, నేరేడ్ మెట్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి 750 గ్రాముల ఓపీఎం, 500 గ్రాముల పాపిస్టా స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటి విలువ రూ.12.5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. వారు ప్రయణిస్తున్న కారును కూడా సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. నగరంలోని వ్యాపారస్తులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో నలుగురిని ఎల్ బీ నగర్ ఎస్ వోటీ, సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 గ్రాముల హెరాయిన్, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







