జెడ్డా, రబీగ్లో మళ్లీ కుండపోత వర్షాలు!
- November 30, 2022
జెడ్డా: జెడ్డా, రబీగ్ గవర్నరేట్లలో మళ్లీ కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఎన్సీఎం తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉపరితల గాలులు, వడగళ్ళు, కుండపోత వర్షాలు పడతాయని పేర్కొంది. హైవేలపై దృశ్యమానత తగ్గుతుందని పేర్కొంది. మరోవైపు మక్కా ప్రాంతంలో ప్రజలు వర్షం సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. ముఖ్యంగా నీటితో ఉన్న చిత్తడినేలలు, జలపాతాలకు దూరంగా ఉండడం, వర్షం సమయంలో లోయలు దాటే సహసాలను చేయొద్దని హెచ్చరించింది.
గత గురువారం జెడ్డాలో రికార్డు స్థాయిలో179.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరిగ్గా 13 ఏళ్ల క్రితం నగరాన్ని అతలాకుతలం చేసిన విధ్వంసకర వరదల దిగ్భ్రాంతికరమైన జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. తాజా వరదలలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నీట మునిగిన వాహనాల్లో చిక్కుకున్న పలువురిని అధికారులు రక్షించారు. నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. కొన్ని గంటలపాటు విమానాలు, రోడ్డు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. జెడ్డా నివాస పరిసరాల్లోని అనేక వీధులు జలమయమయ్యాయి. దీనివల్ల చాలా వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!