యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ హాస్పటల్ మంజూరు
- December 01, 2022
హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో 100 పడకల ఆసుపత్రికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ వైద్యా విధాన పరిషత్ ఈరోజు(బుధవారం) జీవోను జారీ చేసింది.ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి రూ. 45 కోట్ల 79 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.ఇప్పటికే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.
ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి నిధులు కేటాయించారు. ఇక ఇప్పుడు యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తున్నారు. దీంతో పాటు ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా 13 ప్రాథమిక ఉప కేంద్రాలను మంజూరు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ. 20 లక్షలు కేటాయించారు. ఆరు పడకల యాదాద్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ జీవో నంబర్ 722 ద్వారా ఉత్తర్వులు విడుదల చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









