దక్షిణ ఇరాన్లో 5.8 తీవ్రతతో భూకంపం: యూఏఈలోనూ ప్రకంపనలు!
- December 01, 2022
యూఏఈ: యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 7.17 గంటలకు దక్షిణ ఇరాన్లో 5.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సీఎం) తెలిపింది. అయితే భూకంప ప్రభావం యూఏఈలో తక్కువగా ఉంటుందని ప్రకటించింది. కాగా దుబాయ్లోని అనేక మంది నివాసితులు భూకంప ప్రకంపనలు అనుభవించినట్లు ట్వీట్ల ద్వారా వెల్లడించారు. @joshdoit8 హ్యాండిల్ని ఉపయోగించే ఒక నెటిజన్.. "మా ఇంట్లో లైట్లు కదిలాయి. దుబాయ్లో తనకు ఇది రెండవ భూకంప ప్రకంపనల అనుభవం." అని తన అనుభవాలను వివరించారు. మరో ట్విట్టర్ యూజర్ పీయూష్ భదానీ నవంబర్ 30న రాత్రి దుబాయ్లో చాలా సమయం పాటు భూకంప ప్రకంపనలు వచ్చాయి." అని పేర్కొన్నారు. @ashshanuferns అనే ట్విట్టర్ యూజర్.. "భుకంపం వచ్చినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. 5 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి." అని తన పోస్టులో రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







