దక్షిణ ఇరాన్లో 5.8 తీవ్రతతో భూకంపం: యూఏఈలోనూ ప్రకంపనలు!
- December 01, 2022
యూఏఈ: యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 7.17 గంటలకు దక్షిణ ఇరాన్లో 5.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సీఎం) తెలిపింది. అయితే భూకంప ప్రభావం యూఏఈలో తక్కువగా ఉంటుందని ప్రకటించింది. కాగా దుబాయ్లోని అనేక మంది నివాసితులు భూకంప ప్రకంపనలు అనుభవించినట్లు ట్వీట్ల ద్వారా వెల్లడించారు. @joshdoit8 హ్యాండిల్ని ఉపయోగించే ఒక నెటిజన్.. "మా ఇంట్లో లైట్లు కదిలాయి. దుబాయ్లో తనకు ఇది రెండవ భూకంప ప్రకంపనల అనుభవం." అని తన అనుభవాలను వివరించారు. మరో ట్విట్టర్ యూజర్ పీయూష్ భదానీ నవంబర్ 30న రాత్రి దుబాయ్లో చాలా సమయం పాటు భూకంప ప్రకంపనలు వచ్చాయి." అని పేర్కొన్నారు. @ashshanuferns అనే ట్విట్టర్ యూజర్.. "భుకంపం వచ్చినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. 5 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి." అని తన పోస్టులో రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









