దక్షిణ ఇరాన్లో 5.8 తీవ్రతతో భూకంపం: యూఏఈలోనూ ప్రకంపనలు!
- December 01, 2022
యూఏఈ: యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 7.17 గంటలకు దక్షిణ ఇరాన్లో 5.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సీఎం) తెలిపింది. అయితే భూకంప ప్రభావం యూఏఈలో తక్కువగా ఉంటుందని ప్రకటించింది. కాగా దుబాయ్లోని అనేక మంది నివాసితులు భూకంప ప్రకంపనలు అనుభవించినట్లు ట్వీట్ల ద్వారా వెల్లడించారు. @joshdoit8 హ్యాండిల్ని ఉపయోగించే ఒక నెటిజన్.. "మా ఇంట్లో లైట్లు కదిలాయి. దుబాయ్లో తనకు ఇది రెండవ భూకంప ప్రకంపనల అనుభవం." అని తన అనుభవాలను వివరించారు. మరో ట్విట్టర్ యూజర్ పీయూష్ భదానీ నవంబర్ 30న రాత్రి దుబాయ్లో చాలా సమయం పాటు భూకంప ప్రకంపనలు వచ్చాయి." అని పేర్కొన్నారు. @ashshanuferns అనే ట్విట్టర్ యూజర్.. "భుకంపం వచ్చినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. 5 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి." అని తన పోస్టులో రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







