దుబాయ్-దోహా డైలీ 6800 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం...
- December 01, 2022
దుబాయ్: ఫిఫా వరల్డ్ కప్ కోసం దాదాపు దశాబ్దకాలం పాటు కష్టపడి, భారీ బడ్జెట్తో మైదానాలను ఖతార్ రెడీ చేసింది.ఈ క్రీడా నిర్వహణలో ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న ఖతార్.. ప్రపంచమంతా తమవైపు తిరిగి చూసేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అభిమానులపై కొన్ని ఆంక్షలు విధించనప్పటికీ మ్యాచులకు భారీ సంఖ్యలోనే ప్రేక్షకులు హాజరవుతున్నారు.ఈ క్రమంలో దుబాయ్, ఖతార్ మధ్య డైలీ ప్రయాణాలు భారీగా పెరిగాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రతిరోజు 6,800 మందికి పైగా రాకపోకలు కొనసాగిస్తున్నారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వెల్లడించారు. ఇక దుబాయ్ విమానాశ్రయంలో ఫుట్బాల్ లవర్స్ ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హమద్, దోహా ఇంటర్నెషనల్ ఎయిర్పోర్టులకు డైలీ వెళ్లే సాధారణ విమాన సర్వీసులు కాకుండా మ్యాచులు ఉండే రోజుల్లో 100కు పైగా స్పెషల్ సర్వీసులు నడిపిస్తున్నట్లు అల్ మర్రి చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







