మెగా మేనల్లుడు రంగంలోకి దూకేశాడుగా.!

- December 01, 2022 , by Maagulf
మెగా మేనల్లుడు రంగంలోకి దూకేశాడుగా.!

ఎపుడూ యాక్టివ్‌గా హుషారుగా కనిపించే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌ తర్వాత జోరు బాగా తగ్గించేశాడు.దాదాపు ఏడాది తర్వాత కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు. 
సినిమా టైటిల్ వివరాలు ఇంకా తెలీదు కానీ, కార్తీక్ అను కొత్త దర్శకుడితో ఓ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించి ఇంతకన్నా వివరాలేమీ బయటికి రాలేదింతవరకూ.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్లు ప్రకటించారు. ఎన్టీయార్ చేతుల మీదుగా ఈ టీజర్ డిశంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో తేజుకి జోడీగా నటిస్తోంది. 
‘రిపబ్లిక్’ సినిమా రిలీజ్‌కి ముందు తేజ్ బైక్ యాక్సిడెంట్‌కి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలం పాటూ తేజ్ మీడియా ముందుకు రాలేదు. 
తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో లాంగ్ గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చాడు తేజ్. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com