మనీలాండరింగ్ దోషులకు 18 సంవత్సరాల జైలు, SR500,000 జరిమానా
- December 03, 2022
సౌదీ: మనీ లాండరింగ్లో నేరం రుజువైన తర్వాత సౌదీ కోర్టు ఇద్దరు సౌదీలు, ఒక అరబ్ జాతీయుడికి 18 సంవత్సరాల జైలు శిక్ష, SR500,000 జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. నేరానికి పాల్పడిన డబ్బుతో పాటు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని, జైలు శిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన పరిశోధనల్లో మనీలాండరింగ్లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులపై నేరారోపణలు నమోదు చేశారు. ఇద్దరు సౌదీలు వాణిజ్య సంస్థల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించారని, ఈ సంస్థల కోసం బ్యాంక్ ఖాతాలను తెరిచి, ఈ సంస్థల పేరుతో లావాదేవీలు చేపట్టడానికి వీలుగా వాటిని ప్రవాసులకు అప్పగించారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు వాణిజ్య సంస్థల ఖాతాలపై జరిపిన ఆర్థిక పరిశోధనలలో ప్రవాసుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖాతాలలో జమ చేసి, ఆపై వాటిని సౌదీ అరేబియా వెలుపల బదిలీ చేసినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!









