యూఏఈ జాతీయ దినోత్సవం: అట్టహాసంగా వేడుకలు
- December 03, 2022
యూఏఈ: అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (ADNEC)లో జరిగిన 51వ జాతీయ దినోత్సవ అధికారిక వేడుకలకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ సభ్యులు, ఎమిరేట్స్ పాలకులు, క్రౌన్ ప్రిన్సెస్, డిప్యూటీ పాలకులు, షేక్లు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్కు అభినందనలు తెలిపారు. దేశాన్ని మార్గంలో నడిపించడంలో తన విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది షేక్లు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు, దౌత్యవేత్తలు , అతిథులు పాల్గొన్నారు.
ఎమిరాటీ సంగీతకారులతో పాటు రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శించిన యూఏఈ జాతీయ గీతంతో అధికారిక వేడుకలు ప్రారంభమయ్యాయి. దీని తరువాత దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్మారక విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ గ్రాండ్ ఈవెంట్లో యూఏఈ వివిధ రంగాలలో సాధించిన విజయాలను వివరిస్తూ.. స్పెషల్ షో ప్రదర్శించారు. యూఏఈ భవిష్యత్తు కోసం దాని సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు, ప్రణాళికలను సవివరంగా వివరిస్తూ నిర్వహించిన కార్యక్రమాలు వేడకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







