తీహార్ జైలులో తోటి ఖైదీలతో చెస్ ఆడుతున్న ఆఫ్తాబ్
- December 03, 2022
న్యూఢిల్లీ: తన జీవిత సహచరి శ్రద్ధావాకర్ను అత్యంత దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలులో తన తోటి ఖైదీలతో చెస్ ఆడుతూ గడుపుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. తీహార్ జైలులోని 4వ నంబర్ సెల్ లో ఉన్న ఆఫ్తాబ్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటున్నాడు.
దొంగతనం కేసుల్లో జైలుకు వచ్చిన ఇద్దరు ఖైదీలతో కలిసి ఆఫ్తాబ్ చెస్ ఆడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. ఆఫ్తాబ్ కు పాలీగ్రాఫ్, నార్కో అనాల్ సిస్ పరీక్షలు ముగియడంతో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. ఆఫ్తాబ్ విధేయతపై ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్ష సమయంలో అధికారుల సూచనలన్నింటినీ ఆఫ్తాబ్ పాటించాడని పోలీసులు చెప్పారు. ఆఫ్తాబ్ కేవలం ఇద్దరు ఖైదీలతోనే మాట్లాడుతున్నాడని జైలు అధికారులు వివరించారు.శ్రద్ధావాకర్ అదృశ్యానికి సంబంధించి విచారణకు పిలిచినప్పుడు మహారాష్ట్ర పోలీసులను ఆఫ్తాబ్ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. మే నెలలో శ్రద్ధ తన ఛతర్పూర్ ఫ్లాట్ను విడిచివెళ్లిందని, ఆమె తనతో టచ్లో లేదని చెప్పాడు. అనంతరం ఢిల్లీ పోలీసుల ముందు ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రీజర్లో ఎలా భద్రపరిచాడో వివరాలను వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









