తీహార్ జైలులో తోటి ఖైదీలతో చెస్ ఆడుతున్న ఆఫ్తాబ్
- December 03, 2022
న్యూఢిల్లీ: తన జీవిత సహచరి శ్రద్ధావాకర్ను అత్యంత దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలులో తన తోటి ఖైదీలతో చెస్ ఆడుతూ గడుపుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. తీహార్ జైలులోని 4వ నంబర్ సెల్ లో ఉన్న ఆఫ్తాబ్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటున్నాడు.
దొంగతనం కేసుల్లో జైలుకు వచ్చిన ఇద్దరు ఖైదీలతో కలిసి ఆఫ్తాబ్ చెస్ ఆడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. ఆఫ్తాబ్ కు పాలీగ్రాఫ్, నార్కో అనాల్ సిస్ పరీక్షలు ముగియడంతో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. ఆఫ్తాబ్ విధేయతపై ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్ష సమయంలో అధికారుల సూచనలన్నింటినీ ఆఫ్తాబ్ పాటించాడని పోలీసులు చెప్పారు. ఆఫ్తాబ్ కేవలం ఇద్దరు ఖైదీలతోనే మాట్లాడుతున్నాడని జైలు అధికారులు వివరించారు.శ్రద్ధావాకర్ అదృశ్యానికి సంబంధించి విచారణకు పిలిచినప్పుడు మహారాష్ట్ర పోలీసులను ఆఫ్తాబ్ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. మే నెలలో శ్రద్ధ తన ఛతర్పూర్ ఫ్లాట్ను విడిచివెళ్లిందని, ఆమె తనతో టచ్లో లేదని చెప్పాడు. అనంతరం ఢిల్లీ పోలీసుల ముందు ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రీజర్లో ఎలా భద్రపరిచాడో వివరాలను వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







