తీహార్ జైలులో తోటి ఖైదీలతో చెస్ ఆడుతున్న ఆఫ్తాబ్
- December 03, 2022
న్యూఢిల్లీ: తన జీవిత సహచరి శ్రద్ధావాకర్ను అత్యంత దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలులో తన తోటి ఖైదీలతో చెస్ ఆడుతూ గడుపుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. తీహార్ జైలులోని 4వ నంబర్ సెల్ లో ఉన్న ఆఫ్తాబ్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటున్నాడు.
దొంగతనం కేసుల్లో జైలుకు వచ్చిన ఇద్దరు ఖైదీలతో కలిసి ఆఫ్తాబ్ చెస్ ఆడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు. ఆఫ్తాబ్ కు పాలీగ్రాఫ్, నార్కో అనాల్ సిస్ పరీక్షలు ముగియడంతో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. ఆఫ్తాబ్ విధేయతపై ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్ష సమయంలో అధికారుల సూచనలన్నింటినీ ఆఫ్తాబ్ పాటించాడని పోలీసులు చెప్పారు. ఆఫ్తాబ్ కేవలం ఇద్దరు ఖైదీలతోనే మాట్లాడుతున్నాడని జైలు అధికారులు వివరించారు.శ్రద్ధావాకర్ అదృశ్యానికి సంబంధించి విచారణకు పిలిచినప్పుడు మహారాష్ట్ర పోలీసులను ఆఫ్తాబ్ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. మే నెలలో శ్రద్ధ తన ఛతర్పూర్ ఫ్లాట్ను విడిచివెళ్లిందని, ఆమె తనతో టచ్లో లేదని చెప్పాడు. అనంతరం ఢిల్లీ పోలీసుల ముందు ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రీజర్లో ఎలా భద్రపరిచాడో వివరాలను వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







