ఖతార్‌ పర్యటనకు బయలుదేరిన యూఏఈ ప్రెసిడెంట్

- December 05, 2022 , by Maagulf
ఖతార్‌ పర్యటనకు బయలుదేరిన యూఏఈ ప్రెసిడెంట్

యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు ఖతార్ దేశంలో అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఖతార్ ఎమిర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆహ్వానం మేరకు ఖతార్ పర్యటకు వెళ్లినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. తన పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ పర్యటన దోహదనం చేస్తుందన్నారు. అంతకుముందు, షేక్ మొహమ్మద్ ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభంలో షేక్ తమీమ్‌ను అభినందించారు. విజయవంతమైన టోర్నమెంట్‌ను నిర్వహించడంలో ఖతార్‌కు యూఏఈ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com