ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్
- December 06, 2022
దోహా: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీలు ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను పెంపొందించడానికి వారి సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఖతార్ పర్యటనలో ఉన్న యూఏఈ ప్రెసిడెంట్ దోహాలోని ఎమిరి దివాన్లో ఖతార్ ఎమిర్ తో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఖతార్ ఎమిర్ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ ని స్వాగతించారు. అలాగే 51వ UAE జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రజలు షేక్ మొహమ్మద్ నాయకత్వంలో పురోగతి, శ్రేయస్సును కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ పర్యటన యూఏఈ -ఖతార్ సహకారాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణలో సహాయపడుతుందని ఎమిర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2022 FIFA ప్రపంచ కప్ను నిర్వహించడంలో విజయం సాధించినందుకు ఎమిర్ షేక్ తమీమ్, ఖతార్ ప్రజలకు యూఏఈ అధ్యక్షుడు తన అభినందనలను తెలియజేశారు. ఇది అన్ని గల్ఫ్ సహకార మండలి దేశాలకు, అరబ్ ప్రపంచానికి గర్వకారణంగా అభివర్ణించారు. ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ను నిర్వహించడంలో ఖతార్ సాధించిన విజయం GCC దేశాలు, అరబ్ ప్రపంచ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు తమ మధ్య ఉన్న అనేక సమస్యలను సమీక్షించారు. అలాగే తాజా ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







