భారత్ వచ్చే బ్రిటన్ ప్రయాణికులకు శుభవార్త...
- December 06, 2022
లండన్: లండన్లోని భారత హైకమిషన్ సోమవారం కీలక ప్రకటన చేసింది. బ్రిటన్ ప్రయాణికుల కోసం ఎలక్ట్రానిక్ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి నెలల్లో ఇండియాకు వీసాల కోసం భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ.. ఈ సర్వీస్ వెంటనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. "ఈరోజు పెద్ద వార్త ఏమిటంటే, మేము మరోసారి ఇ-వీసాలను పునరుద్ధరిస్తున్నాము. ఇది యూకే నుండి ఇండియాకు చాలా సులభంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది" అని దొరైస్వామి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
ఇక ఈ వారం నుంచి ప్రయాణికులు భారతదేశానికి ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని లండన్లోని హైకమిషన్ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం సిస్టమ్ అప్గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతోందని, భారతీయ వీసా వెబ్సైట్ త్వరలో ఈ-వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కాగా, భారత హైకమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బ్రిటన్ స్పందించింది. గత నెలలో ఇండోనేషియాలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలలో ఇ-వీసాలు ఉన్నాయని యూకే పార్లమెంట్లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









