భారత్ లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- December 06, 2022
న్యూ ఢిల్లీ: భారత్ లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.473 తగ్గి రూ.53,898కి చేరింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.54,371గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1,241 తగ్గి, రూ.65,878గా కొనసాగుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ.1,46,146 (USD 1,770.75)గా ఉంది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ సుదీర్ఘకాలం పాటు తగ్గించే అవకాశం లేకపోవడంతో పసిడి ధర తగ్గుతుందని నిపుణులు చెప్పారు. ఔన్సు వెండి ధర రూ.1,847గా ఉంది.
మరోవైపు డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రతిరోజూ పడిపోతూ వెళ్తుంది. ఇవాళ ఉదయం అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.91గా ఉంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 82.60కి పడిపోయింది. నిన్నటితో పోల్చితే 80 పైసలు పడిపోయింది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ అధికంగా కొనసాగిస్తుండడంతో దాని ప్రభావంతో మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









