భారత్ లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- December 06, 2022
న్యూ ఢిల్లీ: భారత్ లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.473 తగ్గి రూ.53,898కి చేరింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.54,371గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1,241 తగ్గి, రూ.65,878గా కొనసాగుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ.1,46,146 (USD 1,770.75)గా ఉంది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ సుదీర్ఘకాలం పాటు తగ్గించే అవకాశం లేకపోవడంతో పసిడి ధర తగ్గుతుందని నిపుణులు చెప్పారు. ఔన్సు వెండి ధర రూ.1,847గా ఉంది.
మరోవైపు డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రతిరోజూ పడిపోతూ వెళ్తుంది. ఇవాళ ఉదయం అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.91గా ఉంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 82.60కి పడిపోయింది. నిన్నటితో పోల్చితే 80 పైసలు పడిపోయింది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ అధికంగా కొనసాగిస్తుండడంతో దాని ప్రభావంతో మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







