ఫిఫా ప్రపంచ కప్: క్వార్టర్ ఫైనల్స్కు చేరిన తొలి అరబ్ దేశంగా నిలిచిన మొరాకో
- December 07, 2022
దోహా: మంగళవారం జరిగిన పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ను ఓడించి క్వార్టర్ఫైనల్కు చేరుకోవడంతో మొరాకో.. క్వార్టర్ ఫైనల్స్కు చేరిన తొలి అరబ్ దేశంగా నిలిచింది. ప్రపంచ కప్ చరిత్రలో ఇంత దూరం వెళ్లిన నాల్గవ ఆఫ్రికన్ జట్టుగా కూడా అవతరించింది. రెండు గంటల పాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచులో 0-0 డ్రా తర్వాత షూటౌట్లో స్పెయిన్ను 3-0తో మొరాకో ఓడించింది. ఇదే ఊపు క్వార్టర్స్ లోనూ కొనసాగితే అరబ్ ప్రపంచం, ఆఫ్రికా నుండి మొట్టమొదటి సెమీ-ఫైనలిస్ట్లుగా మారే అవకాశం ఉంది. శనివారం దోహాలోని అల్ తుమామా స్టేడియంలో జరిగే క్వార్టర్ఫైనల్లో పోర్చుగల్ తో మొరాకో తన అధృష్టాన్ని పరిక్షించుకోనున్నది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







