నారప్ప.! ధియేటర్లో వస్తున్నాడప్పా.!
- December 07, 2022
విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా ‘నారప్ప’.. కరోనా టైమ్లో తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాని ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేశారు. ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి.
వెంకటేష్ లాంగ్ బ్యాక్ తర్వాత పక్కా విలేజ్ మాస్ బ్యాక్ డ్రాప్లో నటించిన సినిమా ఇది. నిజానికి ‘నారప్ప’ ఓటీటీ బొమ్మ కాదు. పక్కా బిగ్ స్ర్కీన్ బొమ్మ.. అని ఓటీటీలో వీక్షించిన ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.
కానీ, అప్పటి పరిస్థితులు అందుకు కలిసి రాకపోవడంతో, నిర్మాత సురేష్ బాబు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. తమిళ హిట్ ‘అసురన్’కి రీమేక్గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ ఇంటెన్స్ లుక్స్కి ప్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఈ సినిమా ధియేటర్ ఫీల్ని ఫీలవ్వలేకపోయామే.. అని లోటుగా భావించిన విక్టరీ ఫ్యాన్స్కి ఆ లోటు తీరబోతోంది. డిశంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ధియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఒక్కరోజు ధియేట్రికల్ రిలీజ్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సందర్భానుసారం రీ రిలీజ్ల పర్వం సక్సెస్ఫుల్గా సాగుతున్న ఈ తరుణంలో వెంకీ ‘నారప్ప’ను ధియేటర్లో రిలీజ్ చేయడం ఫ్యాన్స్కి పండగలా తోస్తోంది.
ఒక్క రోజు రిలీజ్ కాబట్టి, అవకాశాన్ని, రిలీజ్ అయిన ఏరియాని బట్టి, మూడు నుంచి నాలుగు ఆటలుగా ‘నారప్ప’ను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







