‘విరూపాక్ష’గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త అవతార్.!
- December 07, 2022
యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైలెంట్గా ఓ సినిమాని పూర్తి చేసేశాడు. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, సుకుమార్ స్ర్కీన్ప్లే అందించడం విశేషం.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఓ అరుదైన కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ని కన్ఫామ్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 21కి ముందస్తుగానే లాక్ చేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే, మూఢ నమ్మకాలపై జరిగే యుద్ధంగా ఈ సినిమాని చెబుతున్నారు. పల్లెటూళ్లలో జరిగే, బ్లాక్ మ్యాజిక్స్, చేతబడులు.. తదితర వ్యవహారాలపై ఈ సినిమాని సీరియస్ టోన్లో రూపొందించారట.
కాన్సెప్ట్ రెగ్యులర్లాగానే అనిపించినా, తేజు యాక్టింగ్, సుకుమార్ స్క్రీన్ప్లేతో సినిమా వేరే లెవల్కి వెళ్లిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీయార్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే.
సీరియస్ మోడ్ కాన్సెప్ట్ కావడంతో, ఎన్టీయార్ వాయిస్ చాలా బాగా సెట్టయ్యిందనీ, ఫైనల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ అంటున్నారు. ‘రిపబ్లిక్’ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన తేజు, ‘విరూపాక్ష’గా చేయబోతున్న సాహసం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







