‘విరూపాక్ష’గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త అవతార్.!
- December 07, 2022
యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైలెంట్గా ఓ సినిమాని పూర్తి చేసేశాడు. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, సుకుమార్ స్ర్కీన్ప్లే అందించడం విశేషం.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఓ అరుదైన కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ని కన్ఫామ్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 21కి ముందస్తుగానే లాక్ చేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే, మూఢ నమ్మకాలపై జరిగే యుద్ధంగా ఈ సినిమాని చెబుతున్నారు. పల్లెటూళ్లలో జరిగే, బ్లాక్ మ్యాజిక్స్, చేతబడులు.. తదితర వ్యవహారాలపై ఈ సినిమాని సీరియస్ టోన్లో రూపొందించారట.
కాన్సెప్ట్ రెగ్యులర్లాగానే అనిపించినా, తేజు యాక్టింగ్, సుకుమార్ స్క్రీన్ప్లేతో సినిమా వేరే లెవల్కి వెళ్లిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీయార్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే.
సీరియస్ మోడ్ కాన్సెప్ట్ కావడంతో, ఎన్టీయార్ వాయిస్ చాలా బాగా సెట్టయ్యిందనీ, ఫైనల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ అంటున్నారు. ‘రిపబ్లిక్’ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన తేజు, ‘విరూపాక్ష’గా చేయబోతున్న సాహసం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









