బహ్రెయిన్‌కు చెందిన ‘గోల్డెన్ మ్యాన్’ అశోక్ శెట్టి కన్నుమూత

- December 11, 2022 , by Maagulf
బహ్రెయిన్‌కు చెందిన ‘గోల్డెన్ మ్యాన్’ అశోక్ శెట్టి కన్నుమూత

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ‘గోల్డెన్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన అశోక్ శెట్టి కన్నుమూశారు. 42 సంవత్సరాలు బహ్రెయిన్ లో ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా 2019లో ఇండియాకు తిరిగి వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. శెట్టి బహ్రెయిన్‌లో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ కో వోల్ స్థాపకుడు. అతను జాతీయ దినోత్సవ బిల్‌బోర్డ్‌లను చేపట్టే ఏజెన్సీలో ఉన్నప్పుడు బహ్రెయిన్‌కు చెందిన దివంగత అమీర్, హెచ్‌హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పెయింటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. డిసెంబర్ 1992లో ఆ పోర్ట్రెయిట్‌ను  రూపొందించినట్లు అతను ఓ సందర్భంలో తెలిపారు.  మిస్టర్ శెట్టి జూన్ 2018లో భారతదేశాని వెళ్లిన సమయంలో అధిక షుగర్ స్థాయి కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. ఆ సంఘటన తర్వాత శెట్టి తన కుమారుడు అభిషేక్ శెట్టి, అతని భార్య వందనా అశోక్ శెట్టితో కలిసి చికిత్స కోసం భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com