ఫిఫా ప్రపంచకప్: సెమీఫైనల్కు చేరిన తొలి అరబ్ దేశంగా చరిత్ర సృష్టించిన మొరాకో
- December 11, 2022
దోహా: పోర్చుగల్ను 1-0తో ఓడించి ఫిఫా ప్రపంచ కప్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి అరబ్ దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఘనా 2010లో చివరి నాలుగు దశలకు చేరుకోవడానికి అవకాశం వచ్చినా పెనాల్టీలో వెనుకబడి ఉరుగ్వే చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ సమయంలో మొరాకో ప్లేయర్ వాలిద్ చెద్దిరాకు రెడ్ కార్డ్ లభించడంతో కేవలం 10 మందితోనే ఆడిన జట్టు అంతిమంగా విజేతంగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్లు ఫ్రాన్స్, ఇంగ్లండ్ల మధ్య జరిగే గేమ్లో విజేతగా నిలిచే జట్టుతో సెమీస్ లో తలపడనున్నది.
అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 44వ నిమిషంలో యూసఫ్ ఎన్-బెసిరి ఏకైక గోల్ చేసి మొరాకోను విజేతంగా నిలిపాడు. స్టేడియంలోని మొరాకో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కాగా, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రోన్ల్డో కన్నీళ్లతో పిచ్ను విడిచిపెట్టాడు. తనకు ఇదే ఆఖరి ప్రపంచ కప్ అని ఇంతకుముందే ప్రకటించారు.
మొరాకో, పోర్చుగల్ గతంలో ఫిఫా ప్రపంచ కప్లో రెండుసార్లు మాత్రమే తలపడ్డాయి. జూన్ 1986లో గ్రూప్ దశల్లో మొదటి తలపడ్డారు. అప్పుడు మొరాకో 3-1 తేడాతో గెలిచింది. అయితే 32 ఏళ్ల తర్వాత రొనాల్డో మ్యాచ్-విన్నర్గా స్కోర్ చేయడంతో పోర్చుగల్ ప్రతీకారం తీర్చుకుంది. గ్రూప్ స్టేజ్ లో 1-0తో విజయం సాధించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







