ఫిఫా ప్రపంచకప్: సెమీఫైనల్కు చేరిన తొలి అరబ్ దేశంగా చరిత్ర సృష్టించిన మొరాకో
- December 11, 2022
దోహా: పోర్చుగల్ను 1-0తో ఓడించి ఫిఫా ప్రపంచ కప్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి అరబ్ దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఘనా 2010లో చివరి నాలుగు దశలకు చేరుకోవడానికి అవకాశం వచ్చినా పెనాల్టీలో వెనుకబడి ఉరుగ్వే చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ సమయంలో మొరాకో ప్లేయర్ వాలిద్ చెద్దిరాకు రెడ్ కార్డ్ లభించడంతో కేవలం 10 మందితోనే ఆడిన జట్టు అంతిమంగా విజేతంగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్లు ఫ్రాన్స్, ఇంగ్లండ్ల మధ్య జరిగే గేమ్లో విజేతగా నిలిచే జట్టుతో సెమీస్ లో తలపడనున్నది.
అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 44వ నిమిషంలో యూసఫ్ ఎన్-బెసిరి ఏకైక గోల్ చేసి మొరాకోను విజేతంగా నిలిపాడు. స్టేడియంలోని మొరాకో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కాగా, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రోన్ల్డో కన్నీళ్లతో పిచ్ను విడిచిపెట్టాడు. తనకు ఇదే ఆఖరి ప్రపంచ కప్ అని ఇంతకుముందే ప్రకటించారు.
మొరాకో, పోర్చుగల్ గతంలో ఫిఫా ప్రపంచ కప్లో రెండుసార్లు మాత్రమే తలపడ్డాయి. జూన్ 1986లో గ్రూప్ దశల్లో మొదటి తలపడ్డారు. అప్పుడు మొరాకో 3-1 తేడాతో గెలిచింది. అయితే 32 ఏళ్ల తర్వాత రొనాల్డో మ్యాచ్-విన్నర్గా స్కోర్ చేయడంతో పోర్చుగల్ ప్రతీకారం తీర్చుకుంది. గ్రూప్ స్టేజ్ లో 1-0తో విజయం సాధించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







