హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం..
- December 11, 2022
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వీరితో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో సుఖ్విందర్ అతని తల్లి పాదాలకు నమస్కారం చేశారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







