తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధం: పవన్ కళ్యాణ్
- December 11, 2022
హైదరాబాద్: తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం జరిగిందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు వివరించింది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన సూచన మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చెప్పారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి అధికంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మొదటి దశలో 32 మందిని కార్యనిర్వాహకులుగా నియమించినట్లు తెలిపారు. వారి పేర్లను జనసేన పార్టీ ప్రకటించింది. కాగా, ఎన్నికల ప్రచారానికిపవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం ‘వారాహి’ పేరుతో వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.
గత ఏపీ ఎన్నికల ముందు పవన్ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సారీ ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం. అనుష్టు నారసింహ యాత్ర పేరుతో ఏపీతో పాటు తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పర్యటిస్తారని తెలుస్తోంది. కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిద్దామని తెలంగాణలోని తమ కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









