ముగిసిన కవిత సీబీఐ విచారణ..
- December 11, 2022
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (CBI) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.
సీఆర్పీసీ 161 కింద కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందే సీబీఐ విచారణ గురించి కవిత న్యాయ నిపుణులతో చర్చించారు. నేటి విచారణలో భాగంగా అరోరాతో లింకేంటి?, ఆ రూ.100 కోట్లు ఎక్కడివి? అనే ప్రశ్నలు కవితను సీబీఐ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈడీ రిమాండు రిపోర్టులో ఆమె పేరును పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్లుగా శరత్ చంద్రతో పాటు కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈడీ చెప్పింది. కాగా, కవితను చూసేందుకు ఆమె ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు వస్తున్నారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









